32.7 C
Hyderabad
March 29, 2024 13: 14 PM
Slider కడప

జనతా కర్ఫ్యూ విజయంపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హర్షం

srikanth reddy

జనతా కర్ఫ్యూకు విశేష స్పందన రావడం, రాయచోటి నియోజక వర్గం ఆదర్శంగా నిలవడం  అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

తాడేపల్లి లోని ఆయన నివాసంలో ఆదివారం  కుటుంబ సమేతంగా   కరోనా వ్యాధి నివారణ కు కృషి చేస్తున్న   పోలీసు, వైద్య ,ఆరోగ్య శాఖ, రెవెన్యూ, మున్సిపల్ , పంచాయితీ రాజ్, సచివాలయ  అధికారులు , సిబ్బంది  చేస్తున్న కృషికి సలాం అంటూ   ఆయన  అభినందిస్తూ చప్పట్లు కొట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రధాని మోదీ, సి ఎం జగన్ లు ఇచ్చిన పిలుపు  మేరకు నియోజక వర్గంలో  జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ఆయన  ధన్యవాదాలు తెలిపారు.

ఇదే స్ఫూర్తితో మహమ్మారి కరోనా వైరస్ సంక్రమణ ను ఎదుర్కొని   మన ప్రాంతానికి రాకుండా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రోజు వారి కూలీలు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడకుండా  వారికి మంచి జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 

ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు  ప్రభుత్వ ఆదేశాలు ,సూచనలు ను పాటిస్తూ కుల,మత ,ప్రాంత బేధాలు లేకుండా అందరం ఐకమత్యంగా నిలుద్దామని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Related posts

ప్ర‌ణాళిక,పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి

Satyam NEWS

ఆర‌వ‌రోజు లాక్‌డౌన్ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించిన సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌

Satyam NEWS

సినీ కార్మికులను ఆదుకున్న మంత్రి తలసాని

Satyam NEWS

Leave a Comment