కరోనా రెండవ దశ నేపథ్యంలో బాలల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సహాయక కేంద్రం టోల్ ఫ్రీ నెంబర్ ను హైదరాబాదు కార్యాలయంలో ఏర్పాటుచేశారని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గురువారం తెలిపారు.
ఈ సహాయక కేంద్రం ద్వారా కరోనాకు గురైన బాలలకు, కోవిడ్ సంరక్షణ కేంద్రం లో తల్లి దండ్రులు ఉండి, పిల్లల పోషణకు ఎవ్వరు లేని ఒంటరి బాలలకు లేదా పోషకులు కరోనా బారినపడి ఒంటరిగా ఉన్న బాలలకు, అదేవిధంగా నిస్సహాయ స్థితిలో ఉన్న బాలల సహాయం కోసం ఇది పని చేస్తుందని తెలిపారు.
ఈ సహాయక కేంద్రం అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040-2 3 7 3 3665 నెంబర్ తో పని చేస్తుందని, అదేవిధంగా మహిళా 181, 1098 చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లను కూడా సంప్రదించి తద్వారా సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఇ.పి. ప్రేమలత, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ కే స్వాతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి జే ఓంకార్ చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ బి ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.