వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో గ్రామ సర్పంచ్ అనిత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు 21 సంవత్సరాల లోపు మగ పిల్లలకు వివాహం చేయడం బాల్య వివాహంగా పరిగణించబడుతుందని, ఇది చట్టరీత్యా నేరమన్నారు.
ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా చూపిస్తూ ఉన్నత స్థాయిలో విద్య నేర్పిస్తూ అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తూ ప్రేరేపించినప్పుడు ఆడపిల్లలకు బాల్య వివాహాలు జరగకుండా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి దేవమ్మ, పంచాయతీ సెక్రెటరీ జహంగీర్, ప్రధానోపాధ్యాయులు శంకరయ్య, ఆశ వర్కర్లు మంజుల, పుష్పలత పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి