శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో ప్రధానోపాధ్యాయుడు ఐడివి ప్రసాద్ అధ్యక్షతన బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి గా నిలపడానికి అతను ఎంతో కృషి చేశారని పంచశీల సిద్ధాంతాన్ని అమలుపరిచేలా ప్రపంచానికి దిక్సూచిగా మార్గం చూపారని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బలివాడ ప్రభాకర రావు, బుడుమూరు అప్పలనాయుడు, బెండి శారద, పిసిని వసంతరావు, గండ్రేటి వినయ్ కుమార్ రాజనాల సతీష్ రాయుడు, సంపతి రావు రమణమ్మ ,నక్కిన స్వప్న, తంగి పద్మావతి పంచిరెడ్డి మోహన్, నారాయణ శెట్టి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post