చైనాలో కరోనా వైరస్ విజృంభణ తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ కేసుల నమోదు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో క్రమంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. దీంతో డ్రాగన్ కంట్రీ తమ దేశ ప్రజలను అలెర్ట్ చేసింది. లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. దీంతో తమ దేశంలోని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. నిత్యావసర వస్తువులను నిల్వజేసుకోవాలని సూచించింది.
కోవిడ్ వెలుగు చూస్తున్న పట్టణాల్లో నిబంధనలు మరింత కఠిన తరం చేస్తుంది. సరిహద్దులు మూసివేస్తుంది. క్వారంటైన్ అమలు చేస్తుంది. లాక్ డౌన్ విదిస్తుంది. అయితే గత కొంతకాలంగా చైనా ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలుస్తోంది.