రామతీర్థం నీలాచలం కొండపైకి త్రిదండి చినజీయర్ స్వామి వెళ్లారు. గత నెల 28న రామతీర్థం నీలాచలం కొండపై రాములోరి విగ్రహ శిరస్సు ఖండన జరిగిన సంగతి తెలిసిందే.
కేసు దర్యాప్తు ను సీఐడీ నుంచీ సిట్ కు బదిలీ చేసారు కూడా. ఈ నేపథ్యంలో వికాసతరంగిణి రాష్ట్రంలో పలు దేవాలయాలలో ద్వంసం చేయబడ్డ దేవాలయాలను చిన జీయర్ సందర్శిస్తారని తెలిపింది.
అనుకున్నట్టుగానే ధనుర్మాసం పూర్తవ్వంగానే చిన జీయర్ నీలాచలం కొండ ను సందర్శించారు.ఈ మేరకు త్రిదండి చిన జీయర్ తన అనూయాయులతో కొండ ప్రాంతాన్ని పరిశీలించారు.
ముందుగా దిగువన ఉన్న దేవాలయాన్ని సందర్శించిన చిన జీయర్ ను విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు దగ్గరుండి చిన జీయర్ ను వెంట పెట్టుకుని నీలాచలం కొండను పరిశీలించారు.
అనంతరం మీడియా తో మాట్లాడారు.నీలాచలం కొండపై ఎక్కేందుకు కొండ వెనక ప్రాంతం నుంచీ కొండ పైకి ఎక్కారు.