గ్రామాల అభివృద్ధిలో ఉపాధి శ్రామికుల పాత్ర ఎంతో కీలకం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామం లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఆదివారంనాడు ఆయన పరిశీలించారు. శ్రామికుల పనితీరును అభినందించారు. శ్రామికులతో కొద్దిసేపు మాట్లాడి వేతనాలు సకాలం లో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నిండు వేసవిలో సైతం శ్రామికులు ఉపాధి పనులు చేయటం గమనించి అబ్బురపడ్డారు. గ్రామాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తున్న వాటిలో ఉపాధి శ్రామికుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి 50 మంది శ్రామికులకు ఒక మేట్ ను నియమించి, శ్రామికులకు పనుల కేటాయింపు, చెల్లింపుల అంశంలో మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవటం జరిగిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. అనంతరం ఉపాధి శ్రామికుల కోసం ప్రత్యేకంగా శీతల పానీయాలు తెప్పించి స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా శ్రామికులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు
previous post