చేతిలో ఫోను ఉంది కదా అని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఉపేక్షించం అని వైసిపి మూకలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు హెచ్చరిక చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం. గత వైసిపి ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి అన్యాయం చేస్తే కూటమి ప్రభుత్వం రాగానే రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించడంతోపాటు, రైతులు ధాన్యం మిల్లర్లకు తరలించిన 24 గంటల్లోపే వారికి ధాన్యం డబ్బులు అందేలా ఏర్పాటులు చేశాం. అదేవిధంగా రబీలో పండించిన దాన్యం కొనుగోలు కూడా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చేపట్టాం. అయితే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం కోసం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ వైసీపీ నాయకులు చేసే సోషల్ మీడియా ప్రచారాలు సిగ్గుచేటు. చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా అని ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఉపేక్షించదు. కచ్చితంగా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు.