జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పాల్వాయి గ్రామంలో ఈనెల 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు చింతల ముని నల్లారెడ్డి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని గ్రామ సర్పంచ్ శివరామిరెడ్డి,ఎంపిటిసి జీవన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బిందెసేవ, శనివారం ఉదయం పంచామృతం, రాత్రి 10 గంటలకు రథోత్సవం,పూజలు అనంతరం పంచామృత అభిషేకం, ఆదివారం పారువేట భజనలు సంకీర్తనలు తదితర కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు.గ్రామంలోని తాగినీటి సౌకర్యము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వారు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు ప్రజలు ఇక్కడికి వచ్చి దాసంగాలు, నైవిద్యములు స్వామివారికి సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని వారు తెలిపారు.