కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సామాన్యులు సహా పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్కు కరోనా సోకింది.
ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు.
స్వల్ప లక్షణాలతో నిన్న పరీక్షలు చేయించుకోగా, తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాన్నట్లు చెప్పారు.