36.2 C
Hyderabad
April 25, 2024 19: 56 PM
Slider విశాఖపట్నం

టీడీపీ బలపర్చిన  డా.చిరంజీవిరావును గెలిపిద్దాం..!

#tdp

టీడీపీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ అభ్యర్థి చిరంజీవి.. విద్యావంతుడని…కేంద్ర మాజీమంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. టీడీపీ బలపర్చిన చిరంజీరావు.. పట్ట భద్రుల స్థానం లో నిలబెడితే…మొత్తం విద్యారంగ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు.. అశోక్ గజపతిరాజు.

ఈ మేరకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో  పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు గారు,  మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు, బండారు సత్యనారాయణ మూర్తి , కోండ్రు మురళీమోహన్ , మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మీడియా తో మాట్లాడారు . ఈ సందర్బంగా తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి డా. వేపాడ చిరంజీవిరావు గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరికి విన్నవించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి రాజాం టీడీపీ నేత కోండ్రు మురళీ మాట్లాడుతూ  సీఎం జగన్ ఓ మూర్ఖుడు అని ఆరోపించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ అభ్యర్థి డా.చిరంజీవి రావు ను గెలిపించాలని ఈ మేరకు జిల్లా కు చెందిన మాజీమంత్రులు…పొలిట్ బ్యూరో సభ్యులతో  పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మాజీమంత్రి మంత్రి రాజాంకు చెందిన కోండ్రు మురళీ మీడియా తో మాట్లాడుతూ.. సీఎం జగన్… చదువు కున్న మూర్ఖుడు అని…ఉత్తరాంధ్ర అభివృద్ధి ఊసే ఎత్తకుండా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తి ప్రభుత్వ బీటలు రావాలంటే పట్ట భద్రులలో చైతన్యం కావాలన్నారు. అందుకు ఉత్తరాంధ్ర పట్ట భద్రుల ఎంఎల్సీ అభ్యర్థి గా టీడీపీ నిలబెట్టిన డా.చిరంజీవిరావును గెలింపించాల్సిన అవసరం…అందరిపైన ఉందన్నారు. ఈ సమావేశంలో  విజయనగరం నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.

Related posts

సూర్య భగవాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఉత్తర భారతీయులు

Satyam NEWS

భారీ ఎత్తున అక్రమ మద్యాన్ని పట్టుకున్న అచ్చంపేట పోలీసులు

Satyam NEWS

నిరుద్యోగ భారతం: రోజు రోజుకూ తగ్గుతున్న ఉద్యోగావకాశాలు

Satyam NEWS

Leave a Comment