ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నిన్నటి వరకూ పని చేసి అత్యంత అమర్యాదగా తొలగింపునకు గురైన ఎల్ వి సుబ్రహ్మణ్యం ఆర్ఎస్ఎస్ ఏజెంటా? అవును అంటూ క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి ఘంటాపథంగా చెబుతున్నది. అందుకే ఆయన ఆకస్మికంగా బదిలీ కాగానే కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నామని ఆ సంస్థ ప్రతినిధి జెరుషలేము మత్తయ్య ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. దేవాదాయ శాఖలో దశాబ్దాలుగా సేవలు చేస్తున్న దళిత ఉద్యోగులను సామూహికంగా తొలగించేందుకు ఎల్ వి సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారని మత్తయ్య అంటున్నారు. క్రైస్తవుల పై కక్ష సాధింపు జీవోలు విడుదల చేసి ఎల్ వి సుబ్రహ్మణ్యం క్రైస్తవ మత దూషణకు పాల్పడ్డారని అందుకు శిక్ష అనుభవించారని ముత్తయ్య అంటున్నారు. ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య ఎల్ వి సుబ్రహ్మణ్యం ను తీసేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నదని ఆయన తెలిపారు. హిందూ మత అనుకూల ఎల్ వి సుబ్రహ్మణ్యం ను తీసేసిన నందుకు గౌరవ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి, స్పెషల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎల్ వి సుబ్రహ్మణ్యంను ప్రాధాన్యత లేని శాఖ కు బదిలీ చేయడం క్రైస్తవుల ఆత్మగౌరవ విజయమని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారి అయిన ఎల్ వి సుబ్రహ్మణ్యం ను బదిలీ చేస్తే క్రైస్తవ మత సంఘాలు హర్షం వ్యక్తం చేయడం ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తెలిగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు ఇది బహుమానం లాగా ఉంది అని రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారి ఐ వై ఆర్ కృష్ణారావు ట్వట్టర్ లో కామెంటు పెట్టినపుడు అది నిజం కాదేమో, కృష్ణారావు లాంటి సీనియర్ అలాంటి వ్యాఖ్య చేయడం ఎంత వరకు కరెక్టు అని అనుకున్న వారికి జరూషలేం ముత్తయ్య జారీ చేసిన సమాధానం ఇస్తున్నది. ఇలా క్రైస్తవ సంఘాల విజయం అని చెప్పుకుంటూ, కేక్ లు కట్ చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే దారుణ పరిణామాలకు సంకేతంగా నిలవబోతున్నదని రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు.
previous post