ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు జిల్లా నరసరావుపేట డిపో గ్యారేజీ లో ఎస్సీ,ఎస్టీ యస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిధులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. గౌరవ అతిథిగా Dy CME గుంటూరు G శరత్ బాబు, డిపో మేనేజర్ ఎస్ కే అబ్దుల్ సలామ్ పాల్గొన్నారు.
సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులు గా పని చేస్తున్న 30 మంది కి రగ్ లు పంపిణీ చేశారు. గ్యారేజ్ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కు నూతన చీరెలు కూడా పంపిణీ చేశారు.
మిట్టపల్లి రమేష్, మద్దిరెడ్డి నరశింహరెడ్డి, మాగులూరి రమణారెడ్డి, కందుల ఎజ్రా, సుజాత పాల్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరి కి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ధన్యవాదాలు తెలిపారు.