యేసు ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజల మనసు తెలిసిన నేత సీఎం కేసీఆర్ అని ఉమ్మడి రoగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
తాండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా బట్టల పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల మనసు తెలిసిన నేత సీఎం కేసీఆర్ అని అన్నారు. కరానా సంక్షోభంలో కూడా ఆర్థికంగా లోటు ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
కులమతాలకు అతీతంగా అన్ని మతాలను గౌరవిస్తూ అందరిని సమానంగా చూసే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. చర్చ్ లకు మౌళిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని తెలిపారు.
తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంతకుముందు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ చైర్మన్ స్వప్న, తహసీల్దార్ చిన్నప్పలనాయుడు, ఎల్మ కన్నె సహకార సంఘం చైర్మన్ రవిగౌడ్,
క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు ముస్తఫా పటేల్ అశోక్ రాజ్, జావేద్, ఇంతియాజ్ ,కౌన్సిలర్లు తోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.