తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయిన ఉయ్యూరు శ్రీనివాస్కు ఊరట లభించింది. శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో మినహాయింపు లభించింది. రూ.25 వేల పూచీకత్తుపై శ్రీనివాస్ విడుదలయ్యారు. పోలీసుల విచారణకు శ్రీనివాస్ సహకరించాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు.
ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో ఆదివారం అన్నగారి జనతావస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం పంపిణీ కార్యక్రమం నిర్వహించగా తొక్కిసలాట చోటుచేసుకొని ముగ్గురు మహిళలు మృతి చెందారు. దీంతో పోలీసులు ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాస్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.