సీనియర్ నటి శ్రియ తన భర్తతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రియ భర్త ఆండ్రీ కొశ్చేవ్ కాషాయ బట్టలు ధరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు.
అనంతరం శ్రియ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకోలేకపోయానని అన్నారు. ప్రస్తుతం శ్రియ ఎన్టీఆర్, రామ్చరణ్లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)లో అజయ్ దేవగణ్కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తున్నారు.