ఏం జరిగిందో ఏమో కానీ నందమూరి బాలకృష్ణ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి జగన్ ప్రభుత్వం అంగీకరించింది. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం కూడా విడుదల అవుతున్నది. మెగాస్టార్ చిరంజీవి అంటే జగన్ కు సన్నిహితుడు కానీ నందమూరి బాలకృష్ణ పరిస్థితి అది కాదు.
అయినా ఎమనుకున్నారో ఏమో రెండు సినిమాలలో వివక్ష చూపించడం బాగుండదు అనుకున్నారో ఏమో కానీ రెండు చిత్రాలకు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి జగన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంక్రాతికి వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదల కానున్న విషయం తెలిసినదే. ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ ఎపి ప్రభుత్వాన్ని కోరగా.. టికెట్ ధరపై గరిష్టంగా రూ. 45 (జిఎస్టి అదనం) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.