సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో ప్రియా సిమెంట్ కార్మికుల సమావేశం గురువారం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు వటైపు సైదులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేయాలని,బిజెపి ప్రభుత్వం కార్మిక,రైతు,వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.క్విట్ ఇండియా స్ఫూర్తితో మోడీ నిరంకుశ విధానాలను వ్యతిరేకించాలని,ఆగస్టు 9న, జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో ప్రజలు,కార్మికులు,రైతులు, అధిక సంఖ్యలో పాల్గొనాలని కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రియా సిమెంట్ యూనియన్ అధ్యక్షుడు తీగల శీను, సోమగాని ప్రకాష్ ,వైయస్ గౌడ్, ఎస్.కె.అజ ముద్దీన్,ఆర్.వీరబాబు,పి.సైదయ్య,యం.అంకారావు,కె.కాంతారావు,వై.సురేష్ ,ఎస్. మట్టారావు,సాయి,ఎ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్