28.7 C
Hyderabad
April 20, 2024 07: 00 AM
Slider నల్గొండ

ప్రమాదంలో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం

#cituc

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏప్రిల్ 21న, తెలంగాణ శిల్పకళ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం సభ్యుడు పందిపోటు గోపయ్య తాపీ మేస్త్రి నూతన నిర్మాణ భవనం రెండవ అంతస్తు పైనుండి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందారు.మృతుని కుటుంబానికి సి ఐ టి యు సంఘం నాయకులు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ నిర్మాణ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తు ప్రమాదానికి గురై గోపయ్య మరణించడం బాధాకరం మైన విషయమని,సంఘం ఆ కుటుంబానికి నిరంతరం అండగా నిలుస్తుందని,వివిధ రకాల ప్రమాదాలలో ఎంతో మంది కార్మికులు తనువులు సాలిచుకుంట్టున్నరని,ఆ కుటుంబాలు అంధకారంలోకి వెళ్తున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో విఫలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లైములకు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న,కోశాధికారి ఉప్పతల నరేష్,మండల కోశాధికారి శీలం వేణు, వల్లెపు నాగరాజు, వముల శివకృష్ణ ఉప్పతల రామకృష్ణ,లింగయ్య,గోపి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సోనియా జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ

Satyam NEWS

గోల్నాక చౌరాస్తాలో డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ 115 వ జయంతి వేడుకలు

Satyam NEWS

దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలి

Murali Krishna

Leave a Comment