39.2 C
Hyderabad
March 29, 2024 15: 10 PM
Slider నల్గొండ

అనారోగ్యంతో కన్నుమూసిన సి ఐ టి యు నాయకుడు

#CITU Hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామంలో  సిఐటియు నాయకుడు గాజుల హసన్ 45 సంవత్సరాలు గత నెల 29వ తేదీన అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను సిఐటియు నాయకులు పరామర్శించారు.

పరామర్శించిన వారిలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి, సి ఐ టి యు జిల్లా నాయకులు యల్క సోమయ్య గౌడ్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు జెడ్ బాలశౌరి రెడ్డి, బండి గోపి, గుండెబోయిన వెంకన్న ఉన్నారు. ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ సిఐటియు సీనియర్ నాయకుడు హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటంలో చురుకుగా పాల్గొన్న హసన్ అకాల మృతి చెందడం సంఘానికి తీరనిలోటని అన్నారు.

వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ బాషా, బత్తుల బాబు, హరీష్, మౌలాలి, కొండలు, సైదులు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

దూసుకువస్తోన్న భారీ తోకచుక్క.. భూమిని ఢీకొట్టనుందా..?

Sub Editor

Black Day: కామారెడ్డిలో మీడియాపై ఎఎస్పీ దురుసు ప్రవర్తన

Satyam NEWS

పృథ్వీ-2 ప్రయోగం విజయవంతం

Satyam NEWS

Leave a Comment