బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, గోవులకు ఉన్న రక్షణ దళిత మహిళలకి రక్షణ లేకుండా పోయిందని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు శీతల రోషపతి విమర్శించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్లో సోమవారం జరిగిన వాల్మీకి సంఘం సి ఐ టి యు అనుబంధం సంస్థ నిరసన ప్రదర్శనలో భాగంగా రోషపతి మాట్లాడుతూ గత నెల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కోహెడ మండలం సముద్రాల గ్రామంలో మనీషా వాల్మీకి పశుగ్రాసం కోసం వెళ్లిన మహిళని నాలుక కోసి వెన్నుముక విరిచి అత్యంత ఘోరంగా చంపి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి వారిని తక్షణమే అరెస్టు చేసి, ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు యలక సోమయ్య గౌడ్, గోవిందు, వాల్మీకి సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి.మహీపాల్ , రాకేష్ ,రాజు, మీనా, రంజిత, లక్ష్మి, మమత, సంగీత, సునీత, తదితరులు పాల్గొన్నారు.