కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో కార్మిక గర్జన పాదయాత్ర ఈ నేల 17 న ఉప్పల్ చేరుకుంటుందని సిఐటియు ఉప్పల్ కార్యదర్శి జె.వెంకన్న పాదయాత్ర పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 73 షెడ్యూల్ ఎప్లాయిమెంట్లో కనీస వేతనాల జిఓలను రాష్ట్ర ప్రభుత్వం సవరించాలన్నారు. విడుదల చేసిన 5 జీఓలకు గెజిట్ చేయాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో కార్మిక గర్జన పాదయాత్ర నిర్వహించ తలపెట్టిందన్నారు.
ఈ పాదయాత్ర ఉప్పల్ చేరుకుని ఉప్పల్ మెయిన్రోడ్డు నుండి పారిశ్రామిక వాడలో పాదయాత్ర కొనసాగుతూ చిల్కానగర్ చేరుకుని చిల్కానగర్ చౌరస్తాలో బహిరంగ సభ జరుగుతోందని తెలిపారు. ఈ బహిరంగ సభను జయప్రదం కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, మల్లికార్జున్, భాస్కర్రెడ్డి, వెంకటరావు, ప్రభాకర్, సిద్దులు, దయానంద్ ,శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.