సచివాలయ ఉద్యోగాల పరీక్షల నేపథ్యంలో హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అనుమతి కోసం ఫైల్ను పంపింది.
జవహర్ రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని నిర్ణయం తీసుకుని అనుమతిస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఈ నెల 20 నుండి 26 వరకు సచివాలయ ఉద్యోగాలకోసం రాతపరీక్షలు ఉన్నాయి.
ఈ పరీక్షకు 10 లక్షల మంది హాజరు కానున్నారు. దాంతో పరీక్ష రాసే అభ్యర్థులకోసం రవాణా ఏర్పాటు చేయాల్సి ఉంది.