రెండు రోజుల్లో ప్రారంభం కానున్న జెబిఎస్ – ఎంజిబిఎస్ మెట్రో రైలు మార్గాన్ని నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ నెల 7 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ మెట్రో కారిడార్ ను ప్రారంభిస్తారు. జెబీఎస్ మెట్రో స్టేషన్ లో జరుగుతున్న ఏర్పాట్ల ను వారు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తోబాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి మల్లారెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, మెట్రో ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి సంబంధిత అధికారులు కూడా ఉన్నారు.