సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కోర్టులో జూనియర్ సివిల్ జడ్జీగా పనిచేస్తున్న యన్. మంజుల ను హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు జడ్జీగా బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాస రావు తెలిపారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్న మంజుల న్యాయమూర్తుల ఎంపిక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై మొదటి పోస్టింగ్ లో హుజూర్ నగర్ కోర్టులో ఏప్రిల్ 2017 న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో సౌమ్యురాలిగా, నిస్పక్షపాతిగా పేరు గడించారు.
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోదాడ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి కి పూర్తి అదనపు భాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నారు. కాగా బదిలీ పై వెళ్తున్న న్యాయమూర్తికి సోమవారం కోర్టు ప్రాంగణలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
న్యాయ వాదులంతా విధిగా హాజరు కావాలని వారు కోరారు.