32.2 C
Hyderabad
March 29, 2024 21: 18 PM
Slider క్రీడలు

ముగిసిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడలు

#mulugudist

క్రీడలు మానసిక వికాసానికి తోడ్పడతాయని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పి.వి.రమణ చారి అధ్యక్షతన జరిగిన అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు 6&8 తేదీలలో జరిగిన క్రీడా పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన తస్లీమా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమని, ఉద్యోగరీత్యా బిజీగా గడిపే ఉద్యోగులకు క్రీడల ద్వారా ఉపశమనం కలుగుతుందని అన్నారు. క్రీడలతో మానసిక, శారీరక, ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం,స్నేహభావం కలుగుతుందని ఆమె అన్నారు. అనంతరం తస్లీమా మహిళ క్రీడాకారులతో కబడ్డీ ఆడారు.  అనంతరం ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈ 10,11 తేదీలలో జరిగే పోటీలలో పాల్గొననున్నట్లు పి.వి.రమణ చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.

Related posts

డిశంబర్ నెలాఖరుకు గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణ పనులు పూర్తి

Satyam NEWS

క్రీడాకారిణికి అంబర్ పేట్ ఎమ్మెల్యే ఆర్ధిక సాయం

Satyam NEWS

సీఏం దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జీవోలో సవరణలు

Satyam NEWS

Leave a Comment