40.2 C
Hyderabad
April 19, 2024 17: 22 PM
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు

#cjinvramana

భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ దంపతులు నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సీజేఐ మీడియాతో మాట్లాడుతూ పరిశుభ్రత, సుందరీకరణకు టీటీడీ ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. భవిష్యత్తులో కరోనా లాంటి వ్యాధులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీవారిని ప్రార్థించామని తెలిపారు. శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుచానూరు పద్మావతీ దేవిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభానికి నమస్కరించి, తర్వాత సన్నిధిలోని అమ్మవారి మూలవర్లను దర్శించుకున్నారు.

Related posts

రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్రo

Murali Krishna

(Best) Best Way To Control Diabetes Type 2 Diabetes Natural Cures

Bhavani

ఏలూరులో పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ రాకెట్

Satyam NEWS

Leave a Comment