కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఇళ్ల పట్టాలు విబేధాలు రేపాయి. మైలవరం మండలం, పొందుగల గ్రామంలో పార్టీ కార్యకర్తలు వైసీపీ జెండాలు, క్యాలండర్లు, ఫ్లెక్సీలను తగులబెట్టారు.
అర్హులైన తమకు ఇళ్ల పట్టాలు రాలేదంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా.. అనర్హులకు ఇచ్చారంటూ వైసీపీ కార్యకర్తలు స్థానిక వైసీపీ నేతలపై మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పంపిణీ చేసిన గడియారాలను పగులగొట్టారు.
ఓట్ల కోసం తమ ఇళ్లకు నేతలు ఎలా వస్తారో చూస్తామంటూ వైసీపీలోని ఒక వర్గం నాయకులతో కలిసి స్థానిక పేదల ప్రజలు హెచ్చరించారు.