28.7 C
Hyderabad
April 25, 2024 06: 23 AM
Slider ప్రకాశం

మూడు రాజధానుల రచ్చపై గంగుల ప్రతాప్ రెడ్డి ఫైర్

#Gangula

ప్రకాశం జిల్లా కంభం లో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నాగార్జున రెడ్డి జయంతిని నిర్వహించారు పలువురు వైసిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కందుల నాగార్జున రెడ్డి చిత్రపటానికి  ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు మాట్లాడుతూ సీఎం జగన్ అభివృద్ధికి చిరునామాగా మారారని వెలిగొండ ప్రాజెక్టు ను తరగతిన పూర్తి చేసేందుకు ఆయన చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన పథకాలతో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని  రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అడుగులు వేశారని అన్నారు.

అనంతరం ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. అంతే కాకుండా ఇంకా చాలా పథకాలు ప్రజలకు చేరవలసి ఉంది అని రాజధాని గ్రేటర్ రాయలసీమ లో పెట్టి ఉంటే బాగుండేది అని  ప్రస్తుతం మూడు రాజధానులు ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు అన్నారు.

దీంతో ఏకీభవించని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని సీఎం జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారని గంగుల ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి దీంతో కొద్దిసేపు స్టేజి పైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పక్కన ఉన్న మిగతా నాయకులు సముదాయించేందుకు ప్రయత్నించారు. కానీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు గంగుల ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.

Related posts

మెరైన్ దళాలతో చైనా నౌకాదళం మరింత పరిపుష్టం

Satyam NEWS

కరోనా అదుపునకు ఎంపీ ఆదాల ఆర్థిక సాయం

Satyam NEWS

14న అంబేద్కర్ జయంతి నుంచి బండి రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్ర

Satyam NEWS

Leave a Comment