ఉప్పల్ గణేష్ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో చిల్కానగర్లో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఉప్పల్ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి, స్థానిక కార్పోరేటర్ బన్నాల గీతప్రవీణముదిరాజ్ లు హాజరై మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించాలని సూచించారు. ఉప్పల్ గణేష్ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల మహేందర్ మాట్లాడతూ ప్రజలందరూ మట్టి గణపతి విగ్రహాలను పెట్టి పూజించాలని కోరారు. కరోనా నియమ నిభందనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో అధ్యక్షుడు ఏమండల రామ్రెడ్డి, మాజీ అధ్యక్షుడు అన్యబాలకృష్ణ, చిలుకానగర్ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ బన్నాల ప్రవీణ్ముదిరాజ్ , టీఆర్ఎస్ నాయకులు పల్లె నరసింగరావు, వి.భి.నర్సింహ, జెల్లి మోహన్, ఏడుకొండల్రెడ్డి, జగన్, రవీందర్గౌడ్, మాస శేఖర్, బింగి శ్రీనివాస్, కొప్పల్లి రవీందర్, ఈరెల్లి రవీందర్రెడ్డి, పిట్టల నరేష్, చేర్యాల శ్రీనివాస్, గుడి మధుసూధన్రెడ్డి, వేముల పరమేశ్, కొంపల్లి రాజు, కుమార్ తదితరలు పాల్గొన్నారు.