ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్తాక అధ్యక్షులు ఆకుల మహేందర్, బోరం పేట రామరాజు ఆధ్యర్యంలో పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాలనే సంకల్పంతో గణేశా మట్టి విగ్రహాలను ఉప్పల్ కమాన్ రోడ్డులో ఉచితంగా పంచడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడతూ ప్రజలందరూ మట్టి విగ్రహాలను పెట్టి గణపతిని పూజించాలని కోరారు. కరోనా నియమ నిభందనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు వినాయక చవితి సుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖ సంతోషాలతో ,ఆయురారోగ్యాలతో ,పాడిపంటలతో ప్రజలు ఆనందంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో అన్య బాలకృష్ణ , అల్వాల్ నాగరాజు , రాజేశ్వర్రెడ్డి ,నీరంజన్చారి, జ్ఞానేశ్వర్గౌడ్, నవీన్చారి, నరసింహముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
previous post