మట్టి కుప్పలు, క్లీన్ అండ్ గ్రీన్ తదితర అంశాల పైన గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మునిసిపల్ అధికారులతో చర్చించారు. జిహెచ్ఎంసి అధికారులు ఏఎంఓహెచ్ జ్యోతి బాయి, స్యానిటరి జవాన్ లు, ఎస్ఎఫ్ఏలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్పోరేటర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలోని గోల్నాక డివిజన్ పరిశుద్ధ జలాలకు సంబంధించి కూడా చర్చ జరిగింది.
పారిశుద్ధ కార్మికులు చాలా కార్మికులు ఉద్యోగానికి సరిగ్గా రాక బస్తీలు, కాలనీలలో సరిగా ఉడవడం లేదని స్థానిక ప్రజల నుండి వస్తున్నటువంటి ఫిర్యాదులుని దృష్టిలో పెట్టుకొని మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం కాలనీలో బస్తీలో ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని రోడ్ల డివైడర్లకు అనుకొని ఉన్నటువంటి మట్టి కుప్పలు ఎప్పటికప్పుడు తొలగించాలని అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు ఇబ్బందులు కలగకుండా చూడాలని వారికి అధెశించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.తిరుపతి, ఎల్లమయ్య, జ్యోతి కుమార్, అశోక్, శంకర్, ఎస్ ఎఫ్ ఎ శ్రీధర్, అరుణ్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్ పేట్