సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా బుధవారం పచ్చదనం – పరిశుభ్రత కార్యక్రమం చేపట్టి కార్యాలయ ఆవరణ లోని పిచ్చిమొక్కలు తొలగించి సిబ్బందితో చెత్తా చెదారం తీయించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి గూడెపు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.హరిహారంలో నాటిన మొక్కలను కాపాడుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శాంతకుమారి,ఎంపి ఒ షేక్.మౌలానా,ఏ పి ఓ శైలజ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్