రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు లీడ్ బ్యాంకు అయిన యూనియన్ బ్యాంకు సహకారంతో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట టౌన్ ఏ వన్ కన్వర్షన్ హాల్ లో జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు నరసరావుపేట రీజినల్ బ్యాంక్ మేనేజర్ పి. మారుతిరామ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ టీ కామేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్ వచ్చే సందేశాల పట్ల ఖాతాదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సదస్సులో సత్తెనపల్లి డిఎస్పి విజయ్ భాస్కర్ రెడ్డి, గుంటూరు జిల్లా ఎల్డిఎం ఈదర, రాంబాబు బాపట్ల జిల్లా ఎల్డిఎం కృష్ణా నాయక్, పల్నాడు జిల్లా ఎల్డిఎం వెంకటేశ్వరరావు, బ్యాంక్ అధికారులు రైతులు ఖాతాదారులు పాల్గొన్నారు.
previous post
next post