Slider చిత్తూరు

తిరుపతిలో మద్యం దుకాణాలు మూసివేయాలి

#Naveenkumar Reddy TTD

పవిత్రమైన తిరుపతి నగరంలో మద్యం దుకాణాలను పూర్తిగా మూసేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమర్ రెడ్డి కోరారు. లాక్ డౌన్ కు ఆర్థికంగా నష్టపోతున్నా అన్ని వర్గాల ప్రజలు, తిరుపతి వ్యాపారస్తులు అధికారులకు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. అయితే తిరుపతిలో మద్యం షాపులను లాక్ డౌన్ సమయంలో అనుమతించడం కారణంగా అధికారులు వ్యాపారస్తులు స్థానిక ప్రజల ఆశయం”బూడిదలో పోసిన పన్నీరు” లా మారిందని ఆయన అన్నారు.

తిరుపతి నగరంలోని 34 ప్రభుత్వ మద్యం షాపులను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు తెరవడం పై జిల్లా కలెక్టర్ పునరాలోచించాలని ఆయన కోరారు. నిత్యావసర వస్తువులకు సమయం కేటాయించిన విధంగా ఉదయం 6 నుంచి 11 వరకు మద్యం దుకాణాలను కూడా అనుమతించడంతో భౌతిక దూరం మాస్కులు లేకుండా గుంపులుగా చేరుతున్నారని తద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Related posts

అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు: బాసర బంద్

mamatha

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన

Satyam NEWS

ఈనెల 17కు హాజీపూర్ హత్యల కేసు విచారణ వాయిదా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!