కడప జిల్లా రాజంపేట మండలంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా అకేపాడు లోని అకేపాటి అమరనాధ రెడ్డి పామ్ హౌస్ లో చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి వేలాదిగా పాల్గొన్న మహిళలకు చీర,పురుషులకు పంచె,చొక్కాలను పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పంపిణీ నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి యేటా సంక్రాంతి సంబరాలను నిర్వహించి పరిసర ప్రాంతాల ప్రజలకు దుస్తులు పంచడం ఆనవాయితీగా వస్తోంది. అదే సంప్రదాయాలను ఈ యేడాది కూడా కోన సాగించారు. ఈ సందర్భంగా దుస్తుల పంపిణి తో పాటూ పాల్గొన్న అందరికి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అకేపాటి అనిల్ రెడ్డి,పోలి మురళీ, దాసరి పెంచాలయ్య తదితరులు పాల్గొన్నారు.
previous post