భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో రోడ్లు భారీ ఎత్తున దెబ్బతిన్నాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు మధిర మండలం మాటూరు బ్రిడ్జి వద్ద రహదారి కొట్టుకుపోయింది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మాటూరు బ్రిడ్జి ప్రాంతాన్ని నేడు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాట మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి,
మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, బీసీ సెల్ అధ్యక్షుడు బుచ్చిరాములు, పారుపల్లి విజయ్ కుమార్, దారా బాలరాజు తదితరులు పాల్గొన్నారు.