తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో క్షతగాత్రులై స్విమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ పలు వివరాలు వారితో తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, హోం మినిస్టర్ అనిత, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, టిటిడి ఈవో శ్యామలరావు, డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, మునిసిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, పలువురు ఎమ్మెల్యేలు, ఎంఎల్సీ లు, తదితర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
previous post