2025 నూతన సంవత్సర తొలిరోజున దాదాపు 2 వేల మందిని సిఎం చంద్రబాబు కలిసి మాట్లాడి ఒక కొత్త రికార్డు సృష్టించారు. అదే విధంగా 1,600 మంది పేదలకు రూ.24 కోట్లు విడుదల చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకం చేసి నూతన సంవత్సరం మొదటి రోజు తన పనిని ప్రారంభించిన సిఎం చంద్రబాబు రోజు మొత్తంలో 2 వేల మందితో మాట్లాడారు.
11 am- ఉదయం ఇంట్లో ఐఎఎస్,ఐపిఎస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చిన సిఎం.
12.20- తరువాత దుర్గగుడిలో అమ్మవారి దర్శనం…మీడియా ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు
1.30- అక్కడి నుంచి గవర్నర్ వద్దకు వెళ్లి న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సిఎం
2.30 -తరువాత మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై గంటపాటు చిట్ చాట్.
3.15- తరువాత పార్టీ కార్యాలయానికి వెళ్లిన సిఎం…దాదాపు 1500 మందితో పార్టీ కార్యాలయంలో ఫోటోలు దిగిన సిఎం. ప్రతి ఒక్కరి నుంచి విషెస్ స్వీకరించిన సిఎం..
6 pm@ అనంతరం సచివాలయానికి వెళ్లిన చంద్రబాబు…సిఎంవో అధికారులతో సమావేశం
6.15 -తరువాత సచివాలయం మొదటి బ్లాక్ లో ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులతో గంటపాటు చంద్రబాబు మీటింగ్. తన ఆలోచనలు చెప్పి….వారి సూచనలు తీసుకున్న సిఎం
7.15 -అనంతరం రేపటి క్యాబినెట్ అజెండాపై సిఎం కార్యాలయ అధికారులతో చర్చించి…మరి కొంత మంది నాయకులను సచివాలయంలోనే కలిసి ఉండవల్లి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి.