30.7 C
Hyderabad
April 17, 2024 01: 17 AM
Slider నల్గొండ

NSUI ఆధ్వర్యంలో సిఎం దిష్టి బొమ్మ దగ్ధం

#NSUIHujurnagar

ప్రగతి భవన్ ను ముట్టడించిన  విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ  హుజరాబాద్ లొ  గురువారం  సీఎం కేసిఆర్ దిష్టి బొమ్మ దగ్దం  చేశారు. కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం అంతా అతలా కుతాలం అవుతున్న సమయంలో కరోనా టెస్టు లు పెంచకుండా, విద్యార్థుల పట్ల తమ వైఖరి తెలపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా  ఎన్ ఎస్ యు ఐ నాయకులు ప్రగతి భవన్ ముట్టడించారని అలాంటి వారిని పోలీసులు అరెస్టు చేశారని తక్షణమే వారిని వెంటనే విడుదల  చేయాలని NSUI కోరింది. 

కేసు హై కోర్టు లో పెండింగ్ ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నిన్న NSUI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయవంతంగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా NSUI హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కో – ఆర్డినేటర్ సజ్జద్ మహమ్మద్, కాకతీయ యూనివర్సిటీ కో – ఆర్డినేటర్ గండు ప్రశాంత్ లు మాట్లాడుతూ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ప్రభుత్వం చెయ్యాల్సిన కరోనా టెస్టు ల గురించి పట్టింపు లేని ప్రభుత్వానికి విద్యార్థుల జీవితాలపై పట్టింపు లేకుండా రాష్ట్రంలో వైన్స్ షాపులకు ఇస్తున్న విలువ భావి తరాలకు ఉపయోగ పడే విద్యార్థుల పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది.

తెలంగాణ హైకోర్టు లో పిటిషన్ పెండింగ్ ఉన్న కూడా ప్రభుత్వం తన నిరంకుశ మొండి వైఖరి తో అనాలోచితంగా విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టే రీతిలో పరీక్షల షెడ్యూల్ ఎలా విడుదల చేస్తారు అని ప్రశ్నిస్తూ ప్రభుత్వం వెంటనే ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్ ఎన్ ఎస్ యు ఐ నాయకులను విడుదల చేయాలని వెంటనే పరీక్షలు నిర్వహించ కుండా విద్యార్థులందరిని ప్రమోట్ చెయ్యాలని కోరారు.

అదే విధంగా కరోనా ఉద్రుతిని అరికట్టడానికి వెంటనే ప్రభుత్వం కరోనా టెస్టులను పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు కొండ్రా నవీన్ , సన్ని , అర్షద్ , షారుక్ , ప్రణయ్ , గౌతమ్, రోహన్ , మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా

Satyam NEWS

చంద్రబాబునాయుడిని ఎవరూ అరెస్టు చేయలేదు

Satyam NEWS

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment