ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టు ఆదేశాలను మళ్లీ తప్పుపట్టారు. కడప జిల్లా పులివెందులలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోవడానికి కారణం కోర్టు స్టే ఇవ్వడమేనని ఆయన అన్నారు.
‘పేదలకు భూములు ఇస్తుంటే ఎవడో కోర్టుకు వెళ్లాడు… కోర్టు స్టే ఇచ్చింది’ అంటూ ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 30లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
అయితే పులివెందులలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోవడం బాధాకరమని ఆయన తెలిపారు.
కోర్టు స్టే ఇచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సరే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం అని ఆయన స్పష్టం చేశారు.