35.2 C
Hyderabad
April 20, 2024 18: 02 PM
Slider ప్రత్యేకం

దొరకని అమిత్ షా అప్పాయింట్ మెంట్: జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

#Y S Jaganmohan Reddy

రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ దొరక్కపోవడంతో ఆయన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు.

బెయిల్ రద్దు వ్యవహారం తెరపైకి వచ్చిన ప్రతి సారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఏర్పాటు చేసుకోవడం యాదృచ్ఛికంగా జరుగుతున్నది.

గతంలో రెండు మూడు సార్లు ఇదే విధంగా జరిగింది. ఈ సారి కూడా హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం ఈ సారి కూడా జగన్ మోహన్ రెడ్డి శతవిధాలా ప్రయత్నించారు.

అయితే ఎందుకో కుదరలేదు. ఈ కారణంగా రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులు, కొవిడ్ దృష్ట్యా కేంద్రం నుంచి రాష్ట్రాలకు సాయం తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజీగా ఉన్న కారణంగా ఆయన అపాయింట్​మెంట్ దొరకలేదని సమాచారం.

అమిత్ షాతో భేటీ ఖరారు అయితే వచ్చే వారం రోజుల్లో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Related posts

ఈదమ్మ తల్లికి మొక్కులు చెలించుకున్న కౌన్సిలర్లు

Satyam NEWS

విజయనగరం లో “క్లాప్” ద్వారా సంకల్ప ర్యాలీ ప్రారంభం..!

Satyam NEWS

కంపెనీలను వెళ్లగొట్టినవారు ఇప్పుడు రమ్మంటున్నారు

Satyam NEWS

Leave a Comment