టీడీపీ అధినేత చంద్రబాబు విజయ రహస్యం కొనటం, అమ్మడమే అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అంటే నమ్మకద్రోహం, వెన్నుపోటు, నయవంచన అని విమర్శించారు. చంద్రబాబు చరిత్ర అంతా కొనుగోలు రాజకీయమేనన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికింది చంద్రబాబు కాదా అని నిలదీశారు.ఇక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఆమెని అవమానించారంటూ అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు. శ్రీదేవికి తాడికొండ నియోజకవర్గంలో ఆదరణ తగ్గిందని ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు.. నేరుగా శ్రీదేవికి చెప్పారని తెలిపారు. టికెట్ దక్కదని భావించి వైసీపీకి నమ్మకద్రోహం చేశారని పేర్కొన్నారు. ఆనం రామానారాయణరెడ్డి కూడా ఇచ్చిన ప్యాటర్న్ లో ఓటు వేయలేదు అని తెలిపారు.సీఎం జగన్ జానాన్ని నమ్ముకున్నారని చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన సీఎం జగన్ కి ధీటుగా ఎదుర్కుంటారని తెలిపారు. జగన్ ఏ ఒక్క కులాన్ని నమ్ముకోలేదని, జనాన్ని మాత్రమే నమ్ముకున్నారని ఉద్ఘటించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయటమే జగన్ కు తెలుసని అన్నారు.
previous post