రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసి దోచుకున్న వ్యక్తి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అని బీజేపీ జాతీయ కార్య వర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. విశాఖ బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశం లో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ ‘‘మా సిద్ధాంతం ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్రను దోచుకోవడం కాదు’’ అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ ప్రాంతం లో ప్రశాంతం గా ఉండాలి అని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
రాయల సీమ ప్రాంత జగన్ ఉత్తరాంధ్ర వరకు ఎలా పాదయాత్ర చేసాడు అని ఆయన ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు అమరావతి యాత్ర ను అడ్డుకుంటామని మాట్లాడించడం దారుణం. అమరావతి యాత్ర కు ఏం జరిగినా దానికి సిఎం బాధ్యత వహించాలి అని ఆయన అన్నారు. అమరావతి యాత్ర కి హైకోర్ట్ అనుమతి ఇచ్చింది… ప్రభుత్వం కాదు అని ఆయన అన్నారు. అమరావతి రైతుల అరసవెల్లి యాత్రకు బిజెపి గా పూర్తి మద్దత్తు ఇస్తోందని ఆయన తెలిపారు.
అమరావతి రాజధాని పూర్తి చేస్తాను అని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారని, మరి ఇప్పుడేం చేశారో చూస్తున్నామని ఆయన అన్నారు. అధికారం లోకి వచ్చిన వెంటనే పోలవరం పూర్తి చేస్తాను అన్నారు.ఏది పోలవరం పూర్తి చేసారా అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.