ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్తో సమావేశం అయ్యారు.
అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సీఎం జగన్ కేంద్ర మంత్రికి వివరించారు.
పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్రెడ్డి, అవినాశ్రెడ్డి, గురుమూర్తి ఉన్నారు.