రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన మొండి పట్టుదల వీడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించడం హర్షణీయమని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏపీ రాజధాని వివాదానికి తెరదించి,అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత రెండు కేంద్ర బడ్జెట్ లలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించి ఉంటే ఈపాటికే అమరావతి అభివృద్ధి చెందేదని ఆయన వ్యాఖ్యానించారు. గత 800 రోజులకుపైగా అమరావతి రైతులు, మహిళలు పోరాడే పరిస్థితి ఉండేది కాదని ఆయన అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పై రాష్ట్ర అభివృద్ధిపై జగన్ దృష్టి పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.