సింహాచలం దేవస్థానం లో పాలక మండలి సభ్యురాలి పదవి నుంచి తనను ఎందుకు తొలగించారు చెప్పాలని ఒక మహిళ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ను నేరుగా ప్రశ్నిస్తున్నారు. 2020 మార్చి నెలలో సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యురాలు గా విజయవాడకు చెందిన దాడి దేవి ని నియమించారు. వైసీపీ బలోపేతానికి శ్రమించిన తన భర్త దాడి జగన్ సేవలను గుర్తించి అడగకుండానే తనను ఆ పోస్టులో నియమించారని ఆమె పేర్కొన్నారు. అవసరంలో తనను నియమించే సమయంలో తన పదవీకాలం రెండేళ్లుగా పేర్కొన్నారని ఆమె చెప్పారు. ఇంకా పది నెలల్లో సమయం ఉండగానే ఇప్పుడు ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. తొలగిస్తున్నట్టు వ్యక్తిగతంగా ఎటువంటి సమాచారం లేదని. దీంతో మనస్తాపానికి గురయ్యారు అని దేవి పేర్కొన్నారు.
previous post