ముఖ్యమంత్రి జగన్ ఏ పని చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన సోమేష్ కుమార్ అన్నారు. విజయవాడలో ఏపీ చీఫ్ సెక్రటరీని కలిసి జాయినింగ్ రిపోర్టర్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు ప్రధాన కార్యదర్శి పదవి పోగొట్టుకున్న సోమేశ్ కుమార్ ఏపీ లో జాయిన్ అయ్యేందుకు వెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన ను ఏపీ కి కేటాయించినా ఆయన తెలంగాణ లో కొనసాగారు. ఇప్పుడు ఆయన ఏపీ కి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది.
ఏపీ సీఎస్ ను కలిసిన అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఏపీలో రిపోర్టు చేయమంటే వచ్చాను. ఏపీలో ఏవిధంగా ఉంటే ఆవిధంగా పని చేయడానికి రెడీ. ప్రభుత్వ ఉద్యోగిగా ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా. హోదాతో పని లేకుండా పనిచేస్తాను అని ఆయన అన్నారు.