32.2 C
Hyderabad
March 28, 2024 22: 33 PM
Slider చిత్తూరు

హిందువులను మోసం చేస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

#bjptirupati

క్రిస్టియన్ మతానికి చెందిన వారిని రిజర్వేషన్ కోటాలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువులను మోసం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు.

తిరుపతిలో బీజేపీ  జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కో ఇంచార్జ్ సునీల్ ధియోధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, జాతీయ బీజేవైఎం కార్యదర్శి పనతల సురేష్ నేడు ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

తిరుపతి వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి హిందువు కాదని, చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేస్తాడని వారు తెలిపారు. వైసీపీ అభ్యర్ధి హిందువు అయితే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ని ఎందుకు దర్శించుకోలేదో స్పష్టం చేయాలని వారు కోరారు.

గురుమూర్తి హిందువో కాదో వైసీపీ వెంటనే సమాధానం చెప్పాలి.. సమాధానం చెప్పిన తర్వాత ఓట్లు అడగాలని వారు కోరారు.

తిరుపతి అభ్యర్థులు శ్రీ వెంకటేశ్వర స్వామి పై భక్తి, భావాలు కలిగి ఉండాలి. దేశ, విదేశాల నుంచి వచ్చి వెంకన్న ను దర్శించుకుంటున్నారు.

కానీ వైసీపీ అభ్యర్థి వెంకన్న ను దర్శించుకోలేదు… అని వారన్నారు. సీఎం జగన్ చేస్తున్న ఆలయాల సందర్శన ఒక డ్రామా అని బిజెపి నేతలు అన్నారు.

జగన్ హిందువు కాదు…దీనికి సంబంధించి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి…అని వారు తెలిపారు.

చనిపోయిన కుటుంబంలో ఒకరికి సీటు ఇవ్వడం ఆనవాయితీ…కానీ ఇక్కడ తిరుపతి లో ఎందుకు చనిపోయిన ఎంపీ కుటుంబంలో ఒకరికి సీటు ఇవ్వలేదు… ఎందుకంటే వారు హిందువులు కాబట్టి…అంటూ బిజెపి నేతలు తీవ్రంగా విమర్శించారు.

గురుమూర్తి ని అనర్హుడి గా ప్రకటించాలని రాష్ట్ర, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేసామని వారు తెలిపారు.

Related posts

ప్రొటెస్ట్: నేను రాను బిడ్డో వైజాగు సచీవాలయానికి

Satyam NEWS

ప్రతిపక్షాల ఆస్తులు కూల్చడమే పనిగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

NCC విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన

Satyam NEWS

Leave a Comment