32.7 C
Hyderabad
March 29, 2024 11: 47 AM
Slider ప్రత్యేకం

రాష్ట్రం ఏర్పడ ఎనిమిదేండ్లకు బీజేపీకి బుద్దొచ్చింది..

#kalvakuntlakavita

ఢిల్లీలో కేంద్రం బతుకమ్మ నిర్వహించడానికి కారణం కేసీఆర్

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాక ఢిల్లీలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.  తెలంగాణ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో నేడు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ,  సీఎం కేసీఆర్ కేంద్రం వైపు చూస్తున్నరు అనగానే బతుకమ్మ ఇండియా గేట్ లో ఇవ్వాళ వెలుగుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎనిమిది ఏండ్లకు బీజేపీకి బుద్దొచ్చిందన్నారు.

ఢిల్లీలో బతుకమ్మ ఆడటం వెనక కేసీఆర్ హస్తమే ఉందని సగర్వంగా తెలియజేస్తునన్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అక్కా చెల్లెళ్లు, కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాతే రాష్ట్ర సంస్కృతి, పద్దతి, యాస, భాషకు గౌరవం దక్కిందని, తెలంగాణ తల్లిని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

తెలంగాణలో విమోచన దినం నిర్వహించిన బీజేపీ, గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్టాచూ ఆఫ్ యూనిటీ అంటోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. విభజన కావాలో, యునిటీ కావాలో యువత ఆలోచించాలన్నారు.  సీఎం కేసీఆర్ త్యాగాల వల్ల, వారికి తోడుగా యావత్ తెలంగాణ ప్రజానీకం నిలబడటం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకుని, సగర్వంగా, గౌరవంగా రాష్ట్ర పండుగగా బతుకమ్మ జరుగుతున్నదన్నారు.

Related posts

హీరో సుమంత్ విడుదల చేసిన సముద్ర `జైసేన` వీడియో సాంగ్‌

Satyam NEWS

వివేకా మర్డర్ కేసు: దిగజారి పోయిన పార్టీ పరువు

Satyam NEWS

ఆది శంకరుడే అందరి గురువు: డా.అంతర్ముఖానంద

Satyam NEWS

Leave a Comment